మన తెలంగాణ/హైదరాబాద్: మన కళ్ళు అత్యంత విలువైనవని, చూపును బహుమతిగా అందిస్తాయని.. వాటిని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందని ప్రముఖ నటి ఆదాశర్మ పేర్కొన్నారు. మంగళవారం మెహిదిపట్నంలో డా.అగర్వాల్స్ ఐ ఆసుపత్రి ప్రారంబించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడతో పాటు మెరుగా కంటి చూపు కోసం తరుచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. నగరంలో ఈ సంస్థ కొత్తగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా సంస్థ రీజనల్ హెడ్ డా. గౌరవ్ ఆరోరా ప్రసంగిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్ద అంచనాల ప్రకారం 2.2 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పలు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో అధికశాతం మంది మనదేశంలోనే ఉన్నారన్నారు. మా సంస్థ ప్రతి ఒక్కరికి మెరుగైన నేత్ర దృష్టికి భరోసా కల్పిస్తుందని, ప్రజలకు ఈ కేంద్రం వరం కానుందని విశ్వసిస్తున్నాని పేర్కొన్నారు.
Adah Sharma Inaugurates Dr Agarwals Eye Hospital