Sunday, April 28, 2024

అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Ten years in prison for rape accused

 

మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తూ నల్గొండ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… నల్గొండ జిల్లా, మోత్కూర్ మండలానికి చెందిన బాధితురాలు అక్టోబర్ 02,2011న తండ్రికి మధ్యాహ్నం భోజనం ఇచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అదే సమయంలో నిందితుడు పెద్ద సోమయ్య(30) ఎదురు పడ్డాడు. బాధితురాలిని సమీపంలోని మూసీ నది పొదల్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. అరిస్తే చంపివేస్తానని గొడ్డలి చూపించి అత్యాచారం చేసిన తర్వాత పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రామన్నపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు పోలీసులు ఛార్జ్‌షీట్ వేయడంతో సాక్షాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి శిక్ష పడే విధంగా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News