Tuesday, May 14, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

ktr

 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు ప్రముఖ నిర్మాత, పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్. తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం ఇది అంటారాయన. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు టి.జి. విశ్వప్రసాద్. తమ సంస్థలైన పీపుల్ టెక్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉద్యోగుల ఒకరోజు వేతనానికి సమానంగా మరికొంత మొత్తాన్ని జతచేసి మొత్తంగా రూ.25 లక్షల చెక్కును మంగళవారం ఉదయం టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్‌కు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా టి.జి.విశ్వప్రసాద్ వెంట సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల కూడా ఉన్నారు.

 

TG Vishwa Prasad donates 25 lakhs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News