Friday, May 3, 2024

ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ తిరుపతి రావు

రంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 254 దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు అదనపు కలెక్టర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News