Thursday, May 2, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Three killed in road accident at Chattarpur

భోపాల్: కారు, ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో భార్యాభర్తలు సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఛతర్‌పూర్ సాగర్-కాన్పూర్ జాతీయ రహదారి నాగర్ గారిమల్‌హారా సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే… మహారాజ్‌పూర్‌ తహసీల్ ప్రాంతంలోని సింగ్పూర్ గ్రామంలో నివాసముంటున్న జంగ్‌బహదూర్ సింగ్ రాజ్‌పుత్, తన భార్య, ఇద్దరు పిల్లలు, రోహిత్ తివారీతో కలిసి ఇండిగో కారులో చిత్రకూట్ ధామ్ కు బయల్దేరారు.

సోమవారం సాయంత్రం చిత్రకూట్‌ను సందర్శించి అర్ధరాత్రి వేళ తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో కారుకు ఒక జంతువు అడ్డం వచ్చింది. దాన్ని రక్షించే ప్రయత్నంలో ఛతర్‌పూర్ నుంచి వస్తున్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జంగ్‌బహదూర్ సింగ్ (35), అతడి భార్య విశాఖ (30), రోహిత్ తివారీ (22) అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన పిల్లల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Three killed in road accident at Chattarpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News