Tuesday, May 7, 2024

టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకుల సబ్‌మెర్సిబుల్ గల్లంతు

- Advertisement -
- Advertisement -

టొరంటో : టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు అయిదుగురు ప్రముఖ పర్యాటకులతో వెళ్లిన సబ్‌మెర్సిబుల్ గల్లంతయింది. అందులో అయిదుగురు పర్యాటకులు ఉన్నారు. వారిలో పాక్‌లో ప్రముఖ వ్యాపారవేత్త షహజాద్ దావూద్‌తో పాటు ఆయన కుమారు సులేమాన్ ఉన్నారు.

పాక్‌లో అత్యంత సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి షహజాద్ దావూద్. ఎస్‌ఇటిఐ ఇనిస్టిట్యూట్‌లో ఆయన ట్రస్టీగా కూడా ఉన్నారు. పాకిస్థానీలతో పాటు బ్రిటీష్ వ్యాపారవేత్త , 58 ఏళ్ల హమీష్ హార్డింగ్ ఉన్నారు. ఈయన యాక్షన్ ఏవియేషన్ సంస్థ చైర్మెన్. ఓషియన్‌గేట్ సీఈవో స్టాక్‌టన్ రష్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఓషియన్‌గేట్ కంపెనీయే ఈ మిషన్‌ను ఆర్గనైజ్ చేసింది.

ఫ్రాన్స్‌కు చెందిన 73 ఏళ్ల అన్వేషకుడు పౌల్ హెన్రీ నర్జియోలెట్ కూడా ఉన్నారు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో టైటానికి శిథిలాల వద్ద ఈ ఘటన జరిగింది. టూరిస్టు సబ్‌మెర్సిబుల్ డైవ్ చేసిన గంటా 45 నిమిషాల తర్వాత ఆ సబ్‌తో లింక్ కట్ అయ్యింది. అయితే ఆ సబ్‌లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. టైటాన్ సబ్‌మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బరువు ఉంటుంది. 6.7 మీటర్ల పొడుగు ఉంటుంది. 96 గంటల పాటు దాంట్లో అయిదుగురు ఉండవచ్చు. సబ్‌లో 8 రోజుల పర్యటనకు రెండున్నర లక్షల డాలర్లు వసూలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News