Thursday, May 2, 2024

నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

- Advertisement -
- Advertisement -

తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రికి సిఎం కెసిఆర్ ఆదేశాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురు వారాలు రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

సెలవులు ప్రకటిస్తూ మంత్రి సబిత ట్వీట్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు బుధ, గురువారాలలో సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News