- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా విస్తరిస్తుంది. రోజురోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో దేశంలో కరోనా కేసులు ఏకంగా 40 వేలకు పైగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 42,505కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,391 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా నుంచి 11,775 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 29,335 మంది చికిత్స పొందుతున్నారు.
Total 42,505 Corona Positive Cases Registered in India
- Advertisement -