Friday, September 19, 2025

ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  సిమెంట్ ఇటుక బట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సోలార్ సమీపంలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : హైదరాబాద్ విలవిల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News