హైదరాబాద్: జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు నిర్మించిన మెట్రో రైల్ ప్రారంభం కానున్న నేపధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ మద్యాహ్నాం 3 గంటల నుంచి 4.30గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
సంగీత్, సెయింట్ జాన్ రోటరీ నుంచి వచ్చే వాహనాలను వైఎంసిఎ జంక్షన్ వద్ద డైవర్ట్ చేసిన ఎస్బిఐ వద్ద రైటర్న్ తీసుకుని స్వీకర్, ఉపకార్, జేబిఎస్, టివోలి వైపు మళ్లించనున్నారు. సికింద్రాబాద్, జెబిఎస్ పికెట్,టివోలి జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలు స్వీకర్ ఉపకార్ జంక్షన్ వద్ద నుంచి ఎస్బిఐ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని వైఎంసిఏ వైపు మళ్లించనున్నారు. మారేడ్పల్లి పిఎస్, వెస్ట్మారేడ్పల్లి నుంచి వచ్చే వాహనాలను సర్వసుఖీ కాలనీ టీ జంక్షన్ వద్ద మళ్లించి జిహెచ్ఎంసి నార్త్ జోన్ ఆఫీస్, కోర్టు లేన్, లెఫ్ట్ టర్న్, సెయింట్ జాన్ రోటరీ వైపు వెళ్లిలి.
Traffic Restrictions Tomorrow in Hyderabad