Tuesday, April 30, 2024

రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మంత్రులు..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: వండ్లు కొనాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర అధికార పార్టీ టిఆర్ఎస్ రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ధర్నా కార్యక్రమం చేపట్టింది. దీంతో పలు జిల్లాలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద కేంద్రం ప్రభుత్వం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్లు కొనాలి అంటూ..యాసంగి వరిని కొంటారా.. కొనరా.. అంటూ నినాదాలు చేశారు. ఇక, ఖమ్మంలో మంత్రి వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గ కేంద్రం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి ఎడ్లబండిపై ధర్నా చౌక్ కు వచ్చారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలి అంటూ వరి నారుతో నినాదాలు చేశారు.ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

TRS Party protest against Union Govt 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News