Thursday, May 2, 2024

ముగిసిన టిఎస్ పిజి ఈసెట్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జెఎన్టీయూ నిర్వహించిన టిఎస్ పిజి ఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష ముగిశాయి. రాష్ట్రంలోని ఆయా యూనివర్శిటీల పరిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మే 29వ తేదీ నుంచి జూన్ 1వ తేదీవరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండ సెషన్ నిర్వహించినట్లు టిఎస్ పిజిసెట్ కన్వీనర్ డా.బి. రవిందర్‌రెడ్డి తెలిపారు.

నాలుగు రోజుల పాటు ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, మెకానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సు, ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరిం గ్ పరీక్షలు జరిపినట్లు చెప్పారు. గురువారం ఇన్విరాల్ మెంట్ మేనేజ్‌మెంట్, నానో టెక్నాలజీ పరీక్షలు హైదరాబాద్ కేంద్రంలో 13109 విద్యార్థులు నమోదు చేసుకోగా 11711 విద్యార్థులు హాజరైన్నట్లు, వరంగల్ సెంటర్‌లో 3454 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3171 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు. రెండు కేంద్రాల పరిధిలో 89.85 శాతం మంది హాజరైనట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News