Sunday, April 28, 2024

ప్రశాంతంగా టిఎస్ సెట్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో టిఎస్ సెట్ పరీక్షలు – ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగాయని సెట్ కార్యదర్శి ప్రొపెసర్ సి. మురళీకృష్ణ తెలిపారు. మేనేజ్‌మెంట్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్ రంగాలలో పరీక్షలు మొదటి రోజు 35 ప్రాంతాల్లో నిర్వహించగా 76.85 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు, రెండవ సెషన్‌లో 81.20 శాతం మంది హాజరై చరిత్ర, గణితం, భౌతిక శాస్త్రాలను రాసినట్లు వెల్లడించారు. ఓయూ విసి ప్రొఫెసర్ డి. రవీందర్ మొదటి సెషన్‌కు ముందు ప్రశ్నపత్రం కోడ్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ టు వీసీ, ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్, ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి కోఆర్డినేటర్, ఇతర సీనియర్ యూనివర్సిటీ అధికారులు విసి వెంట ఉన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News