Thursday, May 2, 2024

ట్విటర్ ఇండియా ఎండిపై ఒత్తిడి వద్దు

- Advertisement -
- Advertisement -

పోలీసులకు కర్నాటక హైకోర్టు ఆదేశం

Twitter India Chief's Case Against UP Cops

బెంగళూరు: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా లోనిలో ఒక వృద్ధుడిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి ట్విటర్ ఎండి మనీష్ మహేశ్వరికి కర్నాటక హైకోర్టు ద్వారా తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదనిని ఘజియాబాద్ పోలీసులను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసులో వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి గురువారం ఉదయం 11.30 గంటలకు లోని బార్డర్ పోలీసు స్టేషన్‌కు రావాలని ఈ వారం ప్రారంభంలో ఘిజియాబాద్ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వరిని ఆదేశించారు. అయితే ఆయన సకాలంలో పోలీసు స్టేషన్‌కు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. కాగా, ఘజియాబాద్ పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ ఆయన కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News