Thursday, May 2, 2024

హోంగార్డుపైకి దూసుకెళ్లిన లారీ… ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Lorry Accident

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై శనివారం  లారీ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి ఇద్దరు పైకి దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులలో హోంగార్డు గోవిందరాజులు ఉన్నారు. యాసిడ్ లోడ్ తో లారీ విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News