- Advertisement -
పంజాబ్: భారత ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఇద్దరు పాక్ గూఢచారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అమృత్ సర్ లో స్థానిక పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు గూఢచారులను పాలక్ షేర్ మాసీ, సూరజ్ మాసీలుగా పోలీసులు గుర్తించారు. పాక్ ఇంటెలిజెన్స్ తో పాలక్ షేర్ మాసీ, సూరజ్ మాసీకి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇద్దరు గూఢచారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద భారత బలగాలకు సంబందంచిన డాటా, ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -