- Advertisement -
అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా సిర్హామాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మద్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సిర్హామాలో ఉగ్రవాదులు సంచారిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్ల ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, తుపాకులు, మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -