Thursday, May 2, 2024

యుపి మంత్రి నంద్ గోపాల్ కు కరోనా పాజిటివ్….

- Advertisement -
- Advertisement -

UP Minister Nand gopal corona positive

 

ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తాకు కరోనా వైరస్ సోకింది. నంద్ గోపాల్ కరోనా లక్షణాలు ఉండడంతో అతడికి పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు హోంక్వారంటైన్ లో ఉండి నంద్ గోపాల్ చికిత్స తీసుకుంటున్నారు. 2010లో జరిగిన ఆర్ డిఎక్స్ దాడిలో గాయపడినప్పుడు నంద్ గోపాల్ కు సర్జరీలు జరిగాయి. సర్జరీలతోనే అతడి పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. యోగి ఆదిత్యానాథ్ మంత్రి వర్గంలో ఇప్పటి వరకు 16 మంది మంత్రులకు కరోనా వైరస్ సోకింది. ఉత్తర ప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య 3.74 లక్షలకు చేరుకోగా 5366 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 3.07 మంది కోలుకోగా 61 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఒక్క యుపిలో ఇప్పటి వరకు 91.5 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News