Tuesday, April 30, 2024

మైదానంలోనే కుప్ప కూలిన ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు

- Advertisement -
- Advertisement -

Two Windies women cricketers collapsed on field

 

ఆంటిగ్వా: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఇద్దరు వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు ఉన్నట్లుడి మైదానంలోనే కుప్పకూలిపోయారు. సీమ్ బౌలర్ చినెల్లీ హెన్రీ, బ్యాటర్ చేడీన్ నేషన్‌లు మైదానంలో వేర్వేరుగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. లక్ష ఛేదన కోసం పాకిస్థాన్ మైదానంలోకి దిగినప్పుడు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారని, కోలుకుంటున్నారని విండీస్ బోర్డు తెలిపింది. అస్వస్థతకు గురైన వీరి స్థానాన్ని ఇద్దరు ప్రత్యామ్నాయ ఆటగాళ్లు భర్తీ చేయడంతో మ్యాచ్ కొనసాగింది. కాగా వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News