Thursday, May 2, 2024

పాన్ ఇండియా మూవీ కోసం…

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్న హీరో ధనుష్‌ను-దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు కలిశారు. #డి43 షూటింగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ధనుష్.. దర్శక నిర్మాతలతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కాగా ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రయిట్ మూవీ కావడం విశేషం. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఈ స్టార్ హీరో చెప్పుకొచ్చారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథతో ఈ సినిమా రూపొందనుందని తెలిసింది.

Dhanush meets Director Sekhar Kammula

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News