Tuesday, April 30, 2024

మాఫియానేత చోటా రాజన్‌కు ఎయిమ్స్‌లో చికిత్స

- Advertisement -
- Advertisement -

Underworld Don Chhota Rajan Admitted to AIIMS

న్యూఢిల్లీ: మాఫియా నేత చోటా రాజన్(61)ని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించినట్టు జైళ్ల అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. కడుపులో నొప్పి రావడంతో రాజన్‌ను మంగళవారమే ఎయిమ్స్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. రాజన్‌కు కొవిడ్19 పాజిటివ్ రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ 24న హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించిన విషయం తెలిసిందే. కోలుకున్న తర్వాత రాజన్‌ను తిరిగి తీహార్ జైలకు తరలించారు. రాజన్ తాజాగా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. 2015లో ఇండోనేసియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన రాజన్‌ను పటిష్ట భద్రత ఉండే తీహార్ జైలులో ఉంచారు.

Underworld Don Chhota Rajan Admitted to AIIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News