Tuesday, May 7, 2024

ప్రియుడితో అశ్లీలంగా… గడ్డివాములో భార్యను వేసి తగలబెట్టాడు…

- Advertisement -
- Advertisement -

లక్నో: పొలంలో ప్రియుడితో భార్య సన్నిహితంగా ఉండడం గమనించి ఆమెను భర్త తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ ప్రాంతంలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నెపాల్ సింగ్-అంజలీ అనే దంపతులు గోటియా గ్రామంలో నివసిస్తున్నారు. శనివారం ప్రియుడితో కలిసి భార్య గడ్డవాము వద్ద అశ్లీలంగా భర్తకు కనిపించింది. దీంతో భార్యను భర్త గడ్డిలో వేసి తగలబెట్టడంతో చనిపోయింది. వెంటనే భర్త ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అంజలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గ్రామశివారులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే ఆమెను చంపేశానని నేపాల్ సింగ్ వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News