మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ’మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్గా నటించింది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, లిరికల్ వీడియో సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. నీ కళ్ళు నీలి సముద్రం.., ధక్ ధక్.. పాటలు ఎక్కడ చూసిన మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ‘ఉప్పెన’ సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘రంగులద్దుకున్న..’ అనే సాంగ్ లిరికల్ వీడియోని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తారని మేకర్స్ వెల్లడించారు. దీపావళి కానుకగా నవంబర్ 11న సాయంత్రం 4.05 గంటలకు ’రంగులద్దుకున్న’ పాటను మహేష్ విడుదల చేయనున్నారు. ఇక సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.
Get ready to dive into the ocean of Love ❤️#Ranguladdhukunna will be on your favorite songs playlist from 11th Nov @ 4:05 PM
Thank you Superstar @urstrulyMahesh garu 🎶#Uppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty#BuchiBabuSana @ThisIsDSP @aryasukku @adityamusic pic.twitter.com/QtoeXmNQvM
— Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2020
Uppena Movie 3rd song to Release on Nov 11