Monday, April 29, 2024

యుపిఎస్‌సి సివిల్స్ పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యుపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సిఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేస్తూ యుపిఎస్‌సి నిర్ణయం తీసుకుంది.

అలాగే, ఈ రెండు పరీక్షలను జూన్ 16న ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సివిల్ సర్వీసెస్‌లో 1,056, ఫారెస్ట్ సర్వీసుల్లో 150 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల గడువు మార్చి 6తో ముగిసింది. యుపిఎస్‌సి మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News