Thursday, May 2, 2024

ఫోటో జర్నలిస్ట్ దానిష్ మృతిపట్ల అమెరికా ప్రగాఢ సంతాపం

- Advertisement -
- Advertisement -

UN condoles Indian journalist's death in Afghanistan

వాషింగ్టన్: భారతీయ ఫోటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ మరణం పట్ల అమెరికాలోని జోబైడెన్ ప్రభుత్వం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణను రిపోర్టింగ్ చేస్తున్న సందర్భంగా దానిష్ మృతి చెందారు. ఆ సమయంలో ప్రభుత్వ దళాలవైపు నుంచి రిపోర్టింగ్ చేస్తుండగా, తాలిబన్లు జరిపిన కాల్పుల్లో దానిష్ మృతి చెందారు. 2018 పులిట్జర్ బహుమతి గ్రహీతయైన దానిష్ రాయిటర్స్ తరఫున ఫోటో జర్నలిస్ట్‌గా ఆఫ్ఘన్‌లో పని చేస్తూ మరణించారు. రోహింగ్యా శరణార్థుల గురించి ప్రతిభావంతంగా రిపోర్టింగ్ చేసినందుకుగాను పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న దానిష్ మృతి తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జలీనా పోర్టర్ అన్నారు.

US condoles Indian journalist’s death in Afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News