Thursday, April 25, 2024

కాంగ్రెస్‌కు వీరశైవ లింగాయత్ ఫోరం మద్దతు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో రెండు రోజుల్లో జరగనుండగా, కాంగ్రెస్‌కు కర్ణాటక వీరశైవ లింగాయత్ ఫోరం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈనెల 10న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలని లింగాయత్ వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఫోరం అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్; జేడీఎస్‌లు అభివృద్ధి, ఇతర సమస్యలపై ఎవరికివారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా లింగాయత్ వర్గం ఓట్ల కోసం పార్టీలు ఎంత ప్రాకులాడుతున్నా, ప్రచారాలు ముమ్మరంగా సాగిస్తున్నా లింగాయత్ సమాజం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.

ఇంతవరకు లింగాయత్‌లు కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వారు కాంగ్రెస్ వైపు గాలి మళ్లించారు. ముఖ్యంగా లింగాయత్ యోగుల మద్దతు ఫలితాలను ప్రభావితం చేస్తుంటుంది. ఈ పరిణామాన్ని బీజేపీ అసలు ఊహించలేదు. కిట్టుర్ కర్ణాటక (ముంబై కర్నాటక), కల్యాణ కర్ణాటక (హైదరాబాద్ కర్ణాటక)లతో కూడిన ఉత్తర కర్ణాటక లోని మొత్తం 13 జిల్లాల్లో 90 సీట్లు ఉండగా, వీటిలో అత్యధికంగా బీజేపీ 52 సీట్లు, కాంగ్రెస్ 32, జేడీఎస్ 6 వంతున సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఈసారి లింగాయత్‌లు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో లింగాయత్ ఓట్లు కీలకం కాబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News