Monday, May 6, 2024

కలెక్టర్ గా సేవ చేశా… ఎంపిగా చేస్తా: వెంకట్రామారెడ్డి

- Advertisement -
- Advertisement -

మెదక్: కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా ఆ పార్టీ చేసిందని మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్ అని, ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలన్నారు. మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కలెక్టరేట్ మీడియా పాయింట్ వద్ద ఆయన ప్రసంగించారు. ఈ రోజు రెండు సెట్లు నామినేషన్ వేశామని, రేపు మరో రెండు సెట్లు వేయబోతున్నామని, గురువారం హరీష్ రావు, ఎమ్మెల్యేలు, అశేష అభిమానుల మధ్య రేపు దాఖలు చేయబోతున్నామని వివరించారు.

బిజెపి అభ్యర్థి రఘునందన్ ప్రజలను మోసం చేశారని, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నాగలి, ఎడ్లు, నిరుద్యోగ భృతి అని మోసం చేశారని, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారని వెంకట్రామారెడ్డి దుయ్యబట్టారు. దుబ్బాకలో 54 వేల ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యారని, దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ పార్లమెంట్ నియోజవర్గాల్లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ప్రజలకు అధికారిగా ఉన్నానని, మరింత సేవ చేసేలా ఎంపిగా మీ ముందుకు వస్తున్నానని, ముగ్గురు అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని వెంకట్రామారెడ్డి కోరారు. కలెక్టర్ గా ఇక్కడే పని చేశానని, ఎంపిగా పోటీ చేస్తున్నానని, తన అదృష్టంగా భావిస్తున్నానని, కలెక్టర్ ఎంపిగా మీ ముందుకు వస్తున్నారని ఆశీర్వాదించాలని కోరారు. జీవితాంతం మీ సేవలో ఉంటానని, ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తున్నానని, ఫంక్షన్ హాల్లు నిర్మించి ఉచితంగా సదుపాయం కలిపించానని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News