Tuesday, May 21, 2024

తిరిగి పుంజుకుంటాం: సిపిఎం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ఇటీవలి బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వామపక్షాలకు ఆశాజనకంగా ఉన్నాయని సిపిఎం తెలిపింది. తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందని పలు ప్రాంతాల్లో ఎన్నికల తీరు స్పష్టం చేసిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సుజన్ చక్రవర్తి చెప్పారు. టిఎంసి, బిజెపిలు ఒకేనాణానికి రెండు వైపుల వంటివని, రాష్ట్రంలో వీటి తీరుతో జనం విసిగిపోయినట్లు ఇప్పుడు స్పష్టం అయిందన్నారు. పంచాయతీ ఎన్నికలలో సిపిఎం, కాంగ్రెస్, ఐఎస్‌ఎఫ్‌లతో కలిసి పోటీకి దిగాయని, వీటిలో తమ కూటమికి పడిన ఓట్లు 21 శాతం వరకూ ఉన్నాయని , ఇది స్థానికంగా వామపక్షాలకు ఉన్న బలాన్ని చాటిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News