Thursday, May 2, 2024

యుజర్లకు వాట్సాప్ షాక్..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : నిత్యసమాచార వేదిక వాట్సాప్ దేశంలోని ఖాతాదారులకు వాతలు పెట్టింది. భారతదేశంలో ఆగస్టు నెలలో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది. అంతకు ముందటి నెల జులైతో పోలిస్తే ఇది దాదాపు రెండు లక్షల ఖాతాల వరకూ ఎక్కువగా ఉంది. సరికొత్త ఐటిరూల్స్ 2021 నిబంధనల మేరకు ఈ ఖాతాలను స్తంభింపచేసినట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. తమ వేదిక ద్వారా అశ్లీల సమాచారం, తప్పుడు వార్తల ప్రచారానికి పాల్పడుతున్న ఖాతాలను తమకు అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించుకుని తాము వీటిని నిషేధించినట్లు వాట్సాప్ నిర్వాహకులు ప్రకటన వెలువరించారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా చూస్తే నిషేధంలోకి వచ్చిన వాట్సాప్ ఖాతాల సంఖ్య ఇప్పటి లేక్కతో కలిపితే దాదాపు 3,506,905కు చేరింది. వీటిని పూర్తి స్థాయిలో నిషేధిత ఖాతాల జాబితాలో చేర్చారు. యుజర్ల నుంచి ఎటువంటి వివరణలు తీసుకోకుండానే మెటా యాజమాన్యపు వాట్సాప్ ఈ చర్యకు పాల్పడింది.

ఐటి నిబంధనల మేరకు ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని వాట్సాప్ తెలిపింది. గడిచిన నెల సెప్టెంబర్‌లో దేశంలో 72.28 లక్షల అకౌంట్లను నిలిపివేశారు. ఇందులో దాదాపు 3 లక్షల పదివేల అకౌంట్లపైనా ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిషేధించారు. ఆగస్టు నెలలో నిషేధించిన ఖాతాలలో దాదాపు 35 లక్షల వరకూ అకౌంట్లను ముందస్తు కట్టడిలో భాగంగానే నిలిపివేశారు. ఏ యూజర్ కూడా తమ ఖాతాలను దుర్వినియోగపర్చుకోకుండా చూడటమే తమ లక్షమని కంపెనీ వర్గాలు తమ ఇండియా మంత్లీ అక్టోబర్ నెల నివేదికలో తెలిపాయి. తమ సంస్థ ఎప్పటికప్పుడు విశ్వసనీయతను రక్షించుకుంటుంది. తమ సంస్థ సేవలు ఎటువంటి అడ్డదార్లు తొక్కకుండా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు కంట్రోలు ఉండేలా తమ వద్ద ఉండే ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరివోధకులు , వీరితో పాటు చట్టభద్రతా చర్యల నిపుణులు, ఆన్‌లైన్ భద్రతా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. వీటన్నింటిని అన్నికోణాలలో సాంకేతికపరమైన చర్యలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని నివేదికలో తెలిపారు.

తమకు వివిధ వర్గాల నుంచి అందే ఫిర్యాదులు, అభ్యర్థనల ప్రాతిపదికననే అకౌంట్లను నిలిపివేయడం లేదా నిలిపివేసిన వాటిని పునరుద్ధరించడం జరుగుతుందని మెటా సంస్థ తమ అనుబంధ కంపెనీ వ్యవహారాల గురించి తెలిపింది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వాట్సాప్ సమాచార వినిమయానికి ప్రాధాన్యత ఏర్పడింది. సామాజిక మాధ్యమాలు ప్రత్యేకించి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి బహుళ జన వినియోగిత సాధనాలు కావడంతో వీటిపై నియంత్రణకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో నిర్థిష్ట చర్యలకు దిగింది. సరైన విధంగా ఐటి రూల్స్‌ను పటిష్టం చేసింది. ఇందులో భాగంగా 50 లక్షల యూజర్ల సంఖ్య వరకూ ఉన్న ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ ప్రతి నెలా నివేదికను పొందుపర్చాల్సి ఉంటుంది. తమకు అందిన ఫిర్యాదులు , వీటిపై తీసుకున్న తీసుకుంటున్న చర్యల వివరాలను ఇందులో విధిగా తెలియచేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News