Tuesday, April 30, 2024

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణాదిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వింటర్ సోజోర్న్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 29వ తేదీ నుంచి 2022 జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రపతి సదరన్ సోజోర్న్ కొనసాగనుంది. దక్షిణ భారతంలో 6 రోజులపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాల విడిది చేయనున్నారు. సికిందరబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాంనాథ్ కోవింద్ బస చేయనున్నారు. కొత్త సంవత్సర వేడుకలను కూడా రాష్ట్రపతి ఇక్కడే జరపుకోనున్నారు. ఈమేరకు తెలంగాణా ప్రభుత్వానికి సమాచారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ అందించింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేస్తుంది. కాగా, రాష్ట్రపతిగా దక్షిణాదిలో రంనాథ్ కోవింద్ కు ఇదే ఆఖరి శీతాకాల విడిది. భారత 14వ రాష్ట్రపతిగా జూన్ 2022తో రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది.

Winter Sojourn: President Ramnath Kovind to come Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News