Thursday, May 2, 2024

ఆభరణాల కోసం మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్: బంగారు ఆభరణాల కోసం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీలో చోటుచేసుకుంది.

పట్టణ సిఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం… సుమారు 40 నుంచి 50 ఏళ్ల మహిళను గుర్తు తెలియని వ్య క్తులు దారుణంగా హత్య చేశారని తెలి పారు. గాయాలతో ఉన్న మహిళ మృతదేహంపై ఎడమ కాలు నరికి వేయబడిందని, ఎడమ చెవి, ఎడమ వైపు తలను గాయపరిచిన ఆనవాళ్ళు ఉన్నాయని వివరించారు. కొందు రు గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాల కోసం మహిళను హత్యచేసి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రతాప్ లింగం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News