Sunday, April 28, 2024

మహిళా కానిస్టేబుల్‌ది ఆత్మహత్య కాదు… హత్య

- Advertisement -
- Advertisement -

Woman constable murder by huband

 

అమరావతి: మహిళా కానిస్టేబుల్‌ను పోలీసైన భర్త హత్య చేసిన అనంతరం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మించిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగింది. శవ పరీక్షలో నిజాలు బయటపడడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నీలవేణి అనే మహిళా కానిస్టేబుల్ కంచికచర్ల ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నాగశేషుతో ప్రేమలో పడింది. సంవత్సరం క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడంతో మూడు నెలల క్రితం ఆ దంపతులకు బాబు జన్మించాడు. గత కొంత కాలంగా నీలవేణిపై భర్త అనుమానం పెట్టుకొని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యను చంపాలని తన తమ్ముడితో కలిసి ప్లాన్ చేశాడు. భార్యను గొంతు నులిమి చంపి అనంతరం ఫ్యాన్‌కు ఉరేశారు. అనంతరం పోలీసులకు ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. శవ పరీక్షలో ఆమె ఆత్మహత్య చేసుకోలేదని గొంతు నులిమి హత్యా చేశారని తేలడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News