Tuesday, May 7, 2024

ఫిల్మ్ నగర్‌లో విషాదం..

- Advertisement -
- Advertisement -

ఫిలింనగర్ : హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కుమారుడితో కలిసి తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శిరీష(22)గా గుర్తించారు. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. విశ్వనాథ్, శిరీష దంపతులు ఫిలింనగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.

శుక్రవారం రాత్రి మనీశ్ కు ఉరివేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. శిరీష ప్రస్తుతం 3 నెలల గర్భిణి అని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News