Friday, May 3, 2024

కదులుతున్న రైల్లోంచి కింద‌కు దూకిన మ‌హిళ‌…

- Advertisement -
- Advertisement -

Woman jumps down from moving train

 

బెంగాల్‌ : రైలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వేశాఖ అవగాహన కలిపిస్తున్నప్పటికి… కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కదులుతున్న రైల్లో నుంచి ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు ప్లాట్‌ఫామ్‌పైకి దూకింది. ఈ ఘ‌ట‌న బెంగాల్‌లోని పురులియా స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సంత్ర‌గ‌చ్చి – ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికులు ఎక్కారు. అయితే ఆ మ‌హిళ‌ల‌కు సంబంధించిన వారు రైలు ఎక్క‌లేదు. అప్ప‌టికే రైలు క‌దిలింది. త‌మ వారు రైలు ఎక్క‌లేద‌నే ఉద్దేశంతో.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి మొద‌ట ఒక మహిళ కింద‌కు దూకి ప్లాట్ ఫామ్ పై పడిపోయింది. అంత‌లోనే మ‌రో మ‌హిళ కూడా కింద‌కు దూక‌డంతో.. ఆమె ప్లాట్‌ ఫామ్‌కు, రైలుకు మ‌ధ్య ప‌డిపోయింది. అప్ర‌మ‌త్త‌మైన రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బబ్లూ కుమార్ ప‌రుగెత్తి.. ఆ మ‌హిళా ప్ర‌యాణికురాలి ప్రాణాలను కాపాడారు. మ‌హిళ ప్రాణాలు కాపాడిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌పై రైల్వే ఉన్న‌తాధికారులు ప్ర‌శంస‌లు కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News