Sunday, April 28, 2024

సవతిని హత్య చేసిన మహిళ

- Advertisement -
- Advertisement -

Woman whose Murdered his Husband second Wife

 

భర్త రెండో వివాహం చేసుకోవడం ఇష్టంలేని భార్య
మృతురాలు ఆరు నెలల గర్భిణి

మనతెలంగాణ, హైదరాబాద్ : తన భర్తను వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న ఓ మహిళ, తన భర్త రెండో భార్యను హత్య చేసిన సంఘటన నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….రాయదుర్గం పోచమ్మబస్తీకి చెందిన కర్నె భాస్కర్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. భాస్కర్‌కు 9ఏళ్ల క్రితం జానకితో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం భాస్కర్, స్రవంతి అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. స్రవంతి ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. గతకొంతకాలం నుంచి జానకి, స్రవంతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా స్రవంతి అడ్డుతొలగించుకోవాలని జానకి నిశ్చయించుకుంది. తన సోదరుడు కృష్ణ ప్రసాద్‌తో కలిసి స్రవంతిని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన ఉదయం 10గంటలకు స్రవంతికి జానకి ఫోన్ చేసింది, ఇద్దరి మధ్యల ఉన్న గొడవల గురించి మాట్లాడుకుందామని, రాయదుర్గంలోని ఇంటికి రావాలని చెప్పింది.

ఇది నమ్మిన స్రవంతి ఇంటికి వచ్చేలోపు భర్త భాస్కర్‌కు టీలో నిద్ర మాత్రలు కలిపి పడుకోబెట్టింది. స్రవంతి ఇంటికి వచ్చిన తర్వాత మాటల్లో పెట్టి చున్నీతో ఉరివేసి చంపివేశారు. వెంటనే స్రవంతి మృతదేహాన్ని తన సోదరుడితో కలిసి పక్కగదిలో దాచారు. సాయంత్రం నిద్రలేచిన భాస్కర్ పాతబస్తీలోని తన సోదరుడి ఇంటికి శుభకార్యానికి వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన స్రవంతి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భాస్కర్‌కు ఫోన్ చేసి అడిగారు. తన వద్దకు రాలేదని భాస్కర్ వారికి చెప్పాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జానకి సోదరుడు కృష్ణప్రసాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.స్రవంతిని తామే చంపివేశామని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానకి, కృష్ణప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News