- Advertisement -
వేతనాలు ఇవ్వలేదని ఉద్యోగుల నిరసన
బెంగళూర్: బెంగళూర్కు సమీపంలోని తైవాన్ కంపెనీపై ఉద్యోగులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. విస్ట్రాన్ కార్పొరేషన్కు చెందిన కోలాపూర్ జిల్లా నర్సాపురా ప్లాంట్లో ఈ ఘటన జరిగింది. కొన్ని నెలలుగా తమ వేతనాలు ఇవ్వడం లేదని ఆగ్రహించిన ఉద్యోగులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఆఫీస్పై రాళ్ల దాడి చేశారు. ఓ వాహనాన్ని, కంపెనీ నేమ్ బోర్డును తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ దాడిని కర్నాటక ఉపముఖ్యమంత్రి సి.అశ్వత్థనారాయణ ఖండించారు.
- Advertisement -