- Advertisement -
కెన్యాలో మొక్కలునాటిన ఎన్ఆర్ఐలు
మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టిన రోజు,వివాహాది శుభదినాలకు మొక్కలు నాటే సంస్కృతి ప్రపంచ దేశాల స్వతంత్య్రదినోత్సవాల్లో కూడ వర్ధిల్లుతుంది. కెన్యా రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ఆర్ఐలు మొక్కలు నాటి గ్రీన్ఛాలెంజ్ విసురుకున్నారు. శనివారం కెన్యా రిపబ్లిక్డే సందర్భంగా పిల్లలతో కలిసి మేరి శ్యాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేరిశ్యాం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశాలకు విస్తరిస్తుందని చెప్పారు. ప్రపంచం పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటుందని విచారం వ్యక్తం చేశారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పారు.
- Advertisement -