Monday, April 29, 2024

సొంత నియోజకవర్గంలో రోజాకు చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

 

చిత్తూరు: సినీ నటి, వైసిపి ఎంఎల్ఎ రోజాకు తన సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యకర్తల నుంచే రోజా నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం కెబిఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎంఎల్ఎ రోజాను వైసిపి కార్యకర్తలు అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ కనీసం తమను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తూ సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పుపడుతూ.. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

YCP Supporters Protest Against MLA Roja in Chittoor

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News