Thursday, May 2, 2024

రాజన్నసిరిసిల్లలో భార్యపై భర్త కొడవలితో దాడి

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యపై భర్త కొడవలితో దాడి చేయడంతో ఆమె చెవి వెనుక భాగంలోకి కొడవలి దూసుకెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఒగ్గు మల్లేష్, నిర్మల అనే దంపతులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివసిస్తున్నారు. ఒగ్గు మల్లేష్ మద్యానికి బానిస కావడంతో తాగుడు మానుకోవాలని భార్య అతడితో గొడవ పడుతోంది. బుధవారం మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని ఆమె తలపై బాదాడు. కోడవలి ఆమె చెవి వెనుక భాగంలో దిగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త మాత్రం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

Also Read: ఖైరతాబాద్ లో తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News