Tuesday, April 30, 2024

జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బిజెపిలో కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతలపై మాజీ ఎంపి జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కిస్తున్న వీడియోను ట్వీట్ లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణ బిజెపి నేతలకు ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరమని పేర్కొన్నాడు. ఈ వీడియో ట్వీట్ ను బిఎల్ సంతోష్, హోంమంత్రి అమిత్ షా, బన్సాలీకి ట్యాగ్ చేశారు.

ఈ వివాదాస్పద ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో కలకలం రేపుతోంది. ఈ ట్వీట్ తో తెలంగాణ బిజెపి నేతల మధ్య సయోద్య లేదని, ఎవరికి వారే అన్నట్లు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు హైకమండ్ కసరత్తులు చేస్తోందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Also Read:సాయిచంద్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టిన హరీశ్ రావు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News