- Advertisement -
భీమవరంలోని (Bhimavaram) బొమ్మ కూడలి వద్ద కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మత్తులో ఉన్న యువకులు కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని దుర్భాషలాడారు. అతను బస్సు దిగి వచ్చి ప్రశ్నించగా.. అందరూ కలిసి దాడి చేశారు. అతడు వెళ్తున్న బస్సు వెంబడించి యువకులు వెకిలి చేష్టలు, డ్యాన్సులు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. దీనిపై ఎస్పీ అద్నాన్ నయూం అస్మి మాట్లాడుతూ.. యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
- Advertisement -