Tuesday, May 7, 2024

గుడిసెలో మంటలు చెలరేగి మగ్గురు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుడిసెలో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటనా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామం డేరా బంజారా ప్రాంతంలోని ఒక గుడిసెలో ఒక కుటుంబం నిద్రించింది. శనివారం రాత్రి వేళ ఆ గుడిసెకు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో కాలి ఇద్దరు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  ముగ్గురు పిల్లలను కాపాడేందుకు తండ్రి షకీల్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News