Thursday, May 2, 2024

భర్తను పెళ్లి చేసుకుందని… ప్రియురాలుని చంపి…

- Advertisement -
- Advertisement -

Husband Murder By Wife In UP

 

హైదరాబాద్: తన భర్తను వలలో వేసుకొని పెళ్లి చేసుకుందనే కోపంతో భార్య అతడి ప్రియురాలుని గొంతు నులిమి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా రాయదుర్గంలోని పోచమ్మ బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నె భాస్కర్(33), జానకి(32) అనే దంపతులు రాయదుర్గలో నివసిస్తున్నారు. వీరు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్రవంతి అనే మహిళతో కలిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నడిపిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం స్రవంతి తన భర్తతో విడాకులు తీసుకుంది. భాస్కర్ పరిచయం ప్రేమగా మారడంతో వివాహర సంబంధం పెట్టుకుంది. గత సంవత్సరం భాస్కర్‌ను స్రవింతి పెళ్లి చేసుకోవడంతో జానకికి, స్రవింతికి మధ్య గొడవలు జరిగాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో స్రవంతిని చంపాలని జానకి నిర్ణయం తీసుకుంది. ఒక రోజు మాట్లాడుకుందామని ఇంటికి స్రవంతిని పిలిచింది. అప్పటికే తన భర్తకు టీలో మత్తుమందు కలిపి ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన జానకి తన తమ్ముడు కృష్ణా ప్రసాద్‌తో కలిసి స్రవంతి గొంతు నులిమి హత్య చేసింది. పక్క గదిలో ఆమె మృతదేహాన్ని దాచారు. నిద్ర మత్తు నుంచి లేచిన భర్త బయటకు వెళ్లాడు. స్రవంతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు భాస్కర్‌కు ఫోన్ చేశారు. స్రవంతి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో రాయదుర్గ పోలీస్ స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. తన భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న భార్య తన తమ్ముడితో పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News