Sunday, April 28, 2024

లండన్ పర్యటనలో పలు స్మారక చిహ్నాలు సందర్శించిన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలు, స్మారక కేంద్రాలను అధ్యయనం చేశారు. ప్రఖ్యాత థేమ్స్ రివర్ ఫ్రంట్, పలు వంతెనలు, బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ అధికారులతో కలిసి తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.

Revanth 1

Revanth 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News