Tuesday, April 30, 2024

ఎంఎల్‌ఎ రేఖా శ్యాంనాయక్‌కు ఎంఎల్‌సి కవిత పరామర్శ..

- Advertisement -
- Advertisement -

​MLC Kavitha meets MLA Rekha Shyam Nayak

మనతెలంగాణ/హైదరాబాద్: ఖానాపూర్ ఎంఎల్‌ఎ రేఖా శ్యాంనాయక్ తండ్రి రాజా శంకర్ నాయక్ మృతిచెందడంతో ఆమె నివాసానికి వెళ్లి ఎంఎల్‌సి కవిత పరామర్శించారు. అలాగే రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రేఖా నాయక్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితలు రేఖా నాయక్ తండ్రి రాజా శంకర్‌నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రాజా శంకర్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి, ఎంఎల్‌సిలు భగవంతుణ్ణి ప్రార్థించారు.

​MLC Kavitha meets MLA Rekha Shyam Nayak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News