Wednesday, May 1, 2024

రామ్‌దేవ్ బాబాపై రూ.వెయ్యి కోట్ల దావా

- Advertisement -
- Advertisement -

1000 crore defamation suit against Ramdev Baba

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ వైద్య సంఘం పరువు నష్టం నోటీసు ఇచ్చింది. ఆయనపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని ఐఎంఏ కోరింది. లేకపోతే పరువు నష్టం కింద రూ.వెయ్యి కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రామ్ దేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ సిఎంకు లేఖ రాసింది. అల్లోపతి పనికిమాలిన వైద్యమంటూ ఇటీవల రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు. కాగా, తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. అల్లోపతి వైద్య విధానాన్ని కించపరిచేలా యోగాగురు రాందేవ్ బాబా వ్యాఖ్యలు చేశారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

1000 crore defamation suit against Ramdev Baba

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News