Sunday, April 28, 2024

కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి

- Advertisement -
- Advertisement -

11 dead after consuming poisonous liquor in MP

భోపాల్: కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమవాలీ, మోనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 మంది కల్లు తాగి వాంతులు చేసుకోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా పది మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మిగిలిన ఐదుగురు ప్రస్తుతం గ్వాలియర్, మోరినా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అనురాగ్ సుజానియా తెలిపారు. యుపి రెండో రోజుల క్రితం కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News