Saturday, May 18, 2024

బంగ్లాదేశ్‌లో బస్సును ఢీకొన్న రైలు: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

12 killed in Bangladesh Train and Bus collision

 

ఢాకా: బంగ్లాదేశ్‌లోని జోయ్‌పుర్హత్ జిల్లాలో శనివారం రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సును రైలు ఢీకొనడంతో 12 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. జోయ్‌పుర్హత్ నుంచి పంచ్‌బీబీ వెళుతున్న బస్సు పురానాపోయిల్ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా రాజ్‌షాహి వెళుతున్న ఉత్తర ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొందని స్థానిక పత్రికలు తెలిపాయి. దాదాపు అరకిలోమీటరు దూరం వరకు బస్సును రైలు ఈడ్చుకుని వెళ్లింది. డ్యూటీలో ఉండాల్సిన ఉద్యోగి గైర్హాజరు కావడంతో లెవల్ క్రాసింగ్ వద్ద గేట్లు వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News