Tuesday, May 7, 2024

13,615 కరోనా కొత్త కేసులు.. 13,265 రికవరీలు

- Advertisement -
- Advertisement -

13615 new covid cases reported in india

న్యూఢిల్లీ : సోమవారం 4.21 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 13,615 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే మూడు వేల మేర కేసులు తగ్గాయి. పాజిటివిటీ రేటు 3.23 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 13,265 మంది కోలుకున్నారు. 20 మంది మరణించారు. క్రియాశీల కేసులు 1,31,043 కి పెరిగాయి. క్రియాశీల రేటు 0.30 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. ఇప్పటివరకు 4.36 కోట్ల మంది మహమ్మారి బారిన పడ్డారు. అందులో 4.29 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 199 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. సోమవారం 10.6 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News