Wednesday, May 8, 2024

13 వేలకు తగ్గిన కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

13734 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా అదుపులో ఉంది. తాజాగా 4.11 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 13,734 మందికి కరోనా సోకినట్టు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 27 మంది మరణించారు. 17 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. క్రియాశీల కేసులు 1.39 లక్షలకు తగ్గాయి. క్రియాశీల రేటు 0.32 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.49 శాతంగా ఉంది. ఇప్పటివరకు 4.40 కోట్ల మందికి కరోనా సోకగా, 4.33 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడ్డారు. సోమవారం వరకు 204.6 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా, అందులో నిన్న 26.7 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News